బీజేపీని తొలగించండి, దేశాన్ని రక్షించండి !

బీజేపీని తొలగించండి, దేశాన్ని రక్షించండి :

అవిశ్వాస తీర్మానంలో ఎన్డీయే ప్రభుత్వం 325 ఓట్లతో నెగ్గడంపై మమత స్పందిస్తూ… ఈ నంబర్ కేవలం సభ లోపల వరకే పరిమితమని… పార్లమెంటు బయట ఉన్న ప్రజాస్వామ్యంలో బీజేపీ గెలుపొందలేదని చెప్పారు. బీజేపీకి మద్దతు పలుకుతున్న అన్నాడీఎంకే పార్టీ కూడా రానున్న ఎన్నికల్లో భారీ మూల్యం చెల్లించుకుంటుందని అన్నారు,

 

బీజేపీని తొలగించండి, దేశాన్ని రక్షించండి

బీజేపీని తొలగించండి, దేశాన్ని రక్షించండి

 

మోదీ పార్టీకి 100 పార్లమెంటు స్థానాలు కూడా దక్కవని అన్నారు. కోల్ కతాలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ, రానున్న ఎన్నికల తర్వాత దేశానికి మార్గనిర్దేశం చేసేది పశ్చిమబెంగాలేనని చెప్పారు. రాష్ట్రంలోని మొత్తం 42 ఎంపీ స్థానాలను తృణమూల్ కైవసం చేసుకుంటుందని అన్నారు. మధ్యప్రదేశ్, రాజస్థాన్ లలో కూడా బీజేపీ భారీ ఎత్తున దెబ్బతింటుందని చెప్పారు.

ప్రధాని మోదీ 2024 గురించి మాట్లాడుతున్నారని, ముందు 2019 గురించి ఆలోచించాలని మమత ఎద్దేవా చేశారు. ఆగస్ట్ 15న ‘బీజేపీని తొలగించండి, దేశాన్ని రక్షించండి’ అనే పేరుతో ఓ క్యాంపెయిన్ ను ప్రారంభించనున్నామని చెప్పారు. జనవరి 19న రాష్ట్రంలో ఒక మెగా ర్యాలీని నిర్వహిస్తామని, ఈ ర్యాలీకి దేశంలోని కీలక నేతలంతా హాజరవుతారని తెలిపారు.

 

Read Also : http://www.legandarywood.com/photo-story-sonam-husband-going-viral/

About the Author

Related Posts

Leave a Reply

*