బోయపాటి – చరణ్ మధ్య ‘కోల్డ్ వార్ ‘!
బోయపాటి – చరణ్ మధ్య ‘కోల్డ్ వార్’ :
బోయపాటి శ్రీను దర్శకత్వంలో రాంచరణ్ కథానాయకుడుగా తెరకెక్కుతోన్న ‘వినయ విధేయ రామ’ సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వస్తున్న సంగతి తెలిసిందే, కానీ సినిమాపై ఇంకా బజ్ క్రియేట్ అవ్వాల్సి ఉంది. ఈ నేపథ్యంలో డిజిటల్ ప్రమోషన్ టీమ్, పీఆర్ టీమ్ ప్రచారంపై ఫోకస్ పెడుతోంది. దానయ్య ఈ సినిమాకు నిర్మాతగా ఉన్నారు. వాళ్ళ గురుంచి కొన్ని ఆసక్తి కరమైన విషయాలు లీక్ అవుతున్నాయి.

వినయ విధేయ రామ
తాజాగా చరణ్ , దానయ్య లు బోయపాటి తో సరిగ్గా మెలగడం లేదుట. చరణ్, దానయ్యలు ఒకవైపు అయితే బోయపాటి ఒక్కడే ఒకవైపు ఉన్నట్లు రూమర్స్ వస్తున్నాయి. దీంతో బోయపాటి టీమ్ తో కలవడానికి అయిష్టతతో, సినిమా పూర్తి చేసి ఇవ్వాలి కాబట్టి ఆ పనులు తప్ప మరో విషయం గురించి పట్టించుకోవడం లేదుట. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతోన్న నేపథ్యంలో ల్యాబ్ కు ఇంటికి తప్ప.దానయ్య ఆఫీస్ కు వెళ్లడం లేదుట.

ఆసక్తి కరమైన విషయాలు లీక్
గత నెల రోజులుగా ఇదే తంతు నడుస్తోందని సమాచారం. ముగ్గురి మధ్య ఏవో క్రియేటివ్ డిఫరెన్సెస్ రావడంతో ఈ అలకలు మొదలయ్యాయని సమాచారం. వాస్తవానికి సంగం షూటింగ్ పూర్తయినప్పటి నుంచే ఈ సమస్యలు తలెత్తాయట.

తమాయించుకుని ప్రాజెక్ట్
కానీ మధ్యలో సినిమా వదిలేసి వెళ్తే బాగోదని బోయపాటి తమాయించుకుని ప్రాజెక్ట్ పూర్తిచేసాడని చెప్పుకుంటున్నారు. మరి ఇందులో ఎంత నిజమన్నది కొద్ది రోజులు ఆగితేగానీ క్లారిటీ రాదు. ఈనెల 27న సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ యూసఫ్ గూడ పోలీస్ గ్రౌండ్ లో గ్రాండ్ గా జరగనుంది. ఆరోజు వీలును బట్టి మెగాస్టార్ చిరంజీవి గెస్ట్ గా హాజరయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.
Read Also: https://www.legandarywood.com