మూడు సార్లకు మించి నాన్‌వెజ్ తీసుకుంటే !

మూడు సార్లకు మించి నాన్‌వెజ్ తీసుకుంటే :

వారాలు, శుభదినాల్లో, శుభ ఘడియల్లో పూజలు చేయాలి. లేదా ప్రతి నిమిషం మనస్సులో దేవునిని స్మరించుకుంటే మంచిది. అంతేకానీ అశుభ ఘడియల్లో పూజలు చేయడం, వేళ కానీ వేళలో పూజలు చేయడం మంచిది కాదు. ఇక ఏయే వారాల్లో ఏయే దైవాన్ని పూజించాలో తెలుసుకుని దాని ప్రకారం పూజలు చేస్తే శుభ ఫలితాలను పొందవచ్చును,

 

మూడు సార్లకు మించి నాన్‌వెజ్ తీసుకుంటే

మూడు సార్లకు మించి నాన్‌వెజ్ తీసుకుంటే

 

  ఆదివారం సూర్యదేవునిని పూజించాలి.

  సోమవారం శివాలయానికి వెళ్ళి ఈశ్వరుడిని పూజించాలి.

  మంగళవారాల్లో కుమార స్వామిని పూజిస్తే మంచిది.

  బుధవారం శ్రీ కృష్ణుడిని, వేంకటేశ్వరుడు ఇలా విష్ణు మూర్తి అవతార మూర్తులను పూజించడం వలన సకలసంపదలు   చేకూరుతాయి.

  గురువారం – నవగ్రహాలు, రాఘవేంద్ర స్వామి, సాయిబాబాలను కొలువవచ్చును.

 శుక్రవారం – అమ్మవారిని పూజించడం ఉత్తమం.

 శనివారాల్లో – విష్ణుమూర్తిని, నవగ్రహాలు, ఆంజనేయుడిని పూజించడం మంచిది.

ఇక ఆదివారం సెలవు దొరికింది కదా అని బాగా మాంసాహారం తీసుకునేవారు ఎంతో మంది ఉన్నారు. అలాగే సోమ, మంగళవారాలు వదిలి బుధవారం నాడు మాంసాహారం తీసుకుని తిరిగి గురు, శుక్ర, శనివారాలు బ్రేకిచ్చేవారూ ఉన్నారు. కొందరు మంగళ, శుక్రవారాలు మాంసాహారం ముట్టుకోరు. కొందరు గురు, శుక్ర, శనివారాలు ముట్టుకోరు. అయితే బుధవారం విష్ణువుకు ప్రీతికరమైన రోజు కావున ఆ రోజు మాంసాహారాన్ని తీసుకోవడం కాస్త తగ్గించుకోవడం మంచిది.

అలవాటు పడిన వారు మెల్ల మెల్లగా ఆదివారం మినహా మిగిలిన రోజుల్లో మాంసాహారానికి దూరంగా ఉండటం మంచిది. మాంసాహారం నెలకు రెండు సార్లు తీసుకోవడం ఉత్తమం. అంతేకానీ వారానికి మూడు సార్లకు మించి నాన్‌వెజ్ తీసుకుంటే ఆధ్యాత్మికంగానే కాకుండా సైన్స్ పరంగానూ ఆరోగ్యానికి మంచిది కాదంటున్నారు నిపుణులు.

 

Read Also : http://www.legandarywood.com/photo-shoot-priyanka-chopra-latest-hot-poses/

About the Author

Leave a Reply

*