మోడీ గవర్న’మెంట్ కి ఝలక్’ ఇచ్చిన కేంద్ర మంత్రి !
మోడీ గవర్న’మెంట్ కి ఝలక్’ ఇచ్చిన కేంద్ర మంత్రి:
మోడీ గవర్నమెంట్ కి కేంద్రమంత్రి రాష్ట్రీయ లోక్ సమతా పార్టీ అధినేత ఉపేంద్ర కుష్వాహా రాజీనామాతో మరొక షాక్ ఇచ్చారు. అనంతరం కాంగ్రెస్ అధినేత రాహుల్ తో సమావేశమైన తరువాత ఆయన తన రాజీనామా లేఖను ప్రధాని మోడీకి పంపించారు. పనిలోపనిగా మోడీకి ఒక ఘాటు లేఖాస్త్రం సంధించారు,

మోడీకి ఒక ఘాటు లేఖాస్త్రం
మీ నాయకత్వంలో నేను మోసానికి గురయ్యాను. రాజ్యంగబద్ధమైన కేబినెట్ తన విధులను నిర్వహించకుండా వ్యవస్థను ఒక పద్ధతి ప్రకారం మీరు నాశనం చేశారు

అధినేత ఉపేంద్ర కుష్వాహా రాజీనామా
కేబినెట్ ను రబ్బర్ స్టాంప్ స్థాయికి దిగజార్చారు. మంత్రులు సొంత నిర్ణయాలు తీసుకోకుండా చేసి, మీ నిర్ణయాలను మాత్రమే అమలు చేసేలా చేశారు. మంత్రులు, ఉన్నతాధికారులను నిస్సహాయులుగా చేశారు.

మహాకూటమిలో చేరే అవకాశముంది
ప్రతీ అంశానికి సంబంధించి, అన్ని నిర్ణయాలను మీరు, మీ కార్యాలయం, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా తీసుకుంటున్నారు. పేదలు, అణగారిన వర్గాల కోసం మీరు పని చేయడం లేదు. మీ ప్రత్యర్థులను నిర్వీర్యం చేయడం కోసమే పని చేస్తున్నారు’ అంటూ ప్రధానికి రాసిన లేఖలో కుష్వాహా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కాగా అయన మహాకూటమిలో చేరే అవకాశముంది.
Read Also : http://www.legandarywood.com/