AP Inter Results: ఏపీ ఇంటర్‌ ఫలితాల రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ షెడ్యూల్‌ ఇదే

AP Inter Results link 2nd year: ఏపీ ఇంటర్‌ ఫలితాలు విడుదలయ్యాయి. ఇక.. విద్యార్థులకు రీకౌంటింగ్, రీఫెరిఫికేషన్, సప్లిమెంటరీ షెడ్యూల్‌ను ఏపీ ఇంటర్ బోర్డు ప్రకటించింది. పూర్తి వివరాల్లోకెళ్తే..

AP Inter Results 2022: తాజాగా ఏపీ ఇంటర్మీడియట్ ఫస్టియర్, సెకండ్ ఇయర్ ఫలితాలు (AP Inter Resluts 2022) ఫలితాలు విడుదలయ్యాయి.రికార్డు స్థాయిలో పరీక్షలు నిర్వహించిన 28 రోజుల్లోనే ఫలితాలను విడుదల చేశారు. ఈసారి జరిగి ఇంటర్‌ మొదటి సంవత్సరం పరీక్షలో మొత్తం 2,41,591 (54 శాతం) మంది ఉత్తీర్ణత సాధించగా.. సెకండ్ ఇయర్‌లో శాతం 2,58,449 (61 శాతం) మంది పాస్‌ అయ్యారు. కృష్ణా జిల్లాలో అత్యధికంగా 72 శాతం ఉత్తీర్ణత కాగా.. కడప జిల్లాలో అత్యల్పంగా 50 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. ప్రథమ సంవత్సరంలో బాలురు 49 శాతం, బాలికలు 60 శాతం ఉత్తీర్ణులయ్యారు. ద్వితీయ సంవత్సరంలో బాలురు 56 శాతం, బాలికలు 68 శాతం మంది పాస్‌ అయ్యారు.

ఇక.. విద్యార్థులకు రీకౌంటింగ్, రీఫెరిఫికేషన్, సప్లిమెంటరీ షెడ్యూల్‌ను ఏపీ ఇంటర్ బోర్డు ప్రకటించింది. రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ కోసం జూన్ 25 నుంచి జూలై 5 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక.. సప్లిమెంటరీ పరీక్షలు ఆగస్టులో జరుగనున్నాయి. 2022 ఆగస్ట్ 3 నుంచి 2022 ఆగస్ట్ 12 వరకు సప్లిమెంటరీ ఎగ్జామ్స్ జరుగుతాయి. పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి 5.30 గంటల వరకు రెండు సెషన్స్‌లో జరుగుతాయి. ప్రాక్టికల్ పరీక్షలు 2022 ఆగస్ట్ 17 నుంచి ఆగస్ట్ 22 మధ్య జరుగుతాయి. సప్లిమెంటరీ పరీక్షలకు జూలై 8 లోగా అప్లయ్‌ చేసుకోవాల్సి ఉంటుంది.

ఏపీ ఇంటర్మీడియట్ పరీక్షలకు 9,41,358 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులు 4,45,358 ఉండగా, ఇంటర్ సెకండ్ ఇయర్ విద్యార్థులు 4,23,455 ఉన్నారు. ఇక ఒకేషనల్ విద్యార్థులు 72,299 ఉన్నారు. ఫస్టియర్‌లో 2,41,599 మంది విద్యార్థులు పాసయ్యారు. ఫస్టియర్ ఉత్తీర్ణత 54 శాతం. సెకండ్ ఇయర్‌లో 2,58,449 మంది విద్యార్థులు పాసయ్యారు. సెకండియర్ ఉత్తీర్ణత 61 శాతం. ఫస్టియర్‌లో 49 శాతం మంది బాలురు, 65 శాతం మంది బాలికలు ఉత్తీర్ణులు కాగా, సెకండియర్‌లో 59 శాతం మంది బాలురు, 68 శాతం మంది బాలికలు ఉత్తీర్ణులయ్యారు.

About the Author

Leave a Reply

*