‘కనీస ఆదాయ భరోసా’ బ్యాంకు ఖాతా లో ‘రూ. 72,000’ !
‘కనీస ఆదాయ భరోసా’ బ్యాంకు ఖాతా లో ‘రూ. 72,000’:
ఈ ‘ఎన్నికల’లో ఎలాగైనా ఉనికిని చాటుకోవాలని కాంగ్రెస్ భావిస్తుంది తదనుగుణంగానే రకరకాల ‘తాయిలాలు’ ప్రకటిస్తుంది తాజాగా తాము అధికారంలోకి వస్తే కనుక పేదలకు ‘కనీస ఆదాయ భరోసా’ పథకాన్ని అమలు చేస్తామని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఇటీవల ప్రకటించారు.
ఈ పథకం ద్వారా పేదలకు చేకూరే లబ్ధి గురించి ఈరోజు వెల్లడించారు,

‘కనీస ఆదాయ భరోసా’ బ్యాంకు ఖాతా లో ‘రూ. 72,000’
ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ సమావేశం (సీడబ్ల్యుసీ) సమావేశానంతరం మీడియాతో రాహుల్ మాట్లాడుతూ, ఇటువంటి పథకం ప్రపంచంలోనే ఎక్కడా అమలు కావట్లేదని చెప్పారు. భారత్ లోని 20 % మంది పేదలు అంటే, ఐదు కోట్ల కుటుంబాల్లో 25 కోట్ల మంది పేదలు దీని ప్రయోజనాలు పొందవచ్చని అన్నారు.
- ప్రతి పేదవాడి ‘బ్యాంకు ఖాతా’లో నేరుగా ఏడాదికి ‘రూ. 72,000’ జమ చేస్తామని, ఇందుకు సంబంధించిన అన్ని గణాంకాలను సరి చూసుకున్నామని చెప్పారు.
అలాంటి పథకాల ద్వారానే బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పథకాలను తుంగలో తొక్కింది, ఇలాంటి ‘పథకాలే’ మరల ప్రకటించుకొని ప్రజల ‘చెవిలోపువ్వు’ పెడదామని చూస్తున్నారు చూడాలి ఈ పథకానికి ‘ఓట్లు’ రాలతాయా ?
Read Also: https://www.legandarywood.com