Previous Story
మసీదులో ‘మహిళ’ల అనుమతి ‘వ్యాజ్యం’ దాఖలు !
Posted On 16 Apr 2019
Comment: 0
మసీదులో ‘మహిళ’ల అనుమతి ‘వ్యాజ్యం’ దాఖలు:
భక్తుల మనోభావాలతో సంబంధం లేకుండా శబరిమల ఆలయంలో మహిళలను అనుమతిస్తూ సుప్రీం తీర్పును ఉదహరిస్తూ…
తాజాగా, మసీదుల్లో మహిళలు ప్రవేశించేలా । పురుషులతో కలిసి ఒకేచోట నమాజు చేసేలా ఆదేశాలు ఇవ్వాలంటూ, మహారాష్ట్రకు చెందిన ఒక ముస్లిం దంపతుల జంట వ్యాజ్యాన్ని దాఖలు చేశారు.

మసీదులో ‘మహిళ’ల అనుమతి ‘వ్యాజ్యం’ దాఖలు
మహిళలను మసీదులోకి ప్రవేశించకుండా అడ్డుకోవడం అక్రమమని పిటిషన్లో తెలిపారు.
- అది రాజ్యాంగ వ్యతిరేకమన్నారు.
- 14 | 15 | 21 | 25 | 29 ఆర్టికల్స్ను ఉల్లంఘించినట్లు అవుతుందని కూడా పిటిషన్లో తెలిపారు.
- ఏ మత గురువు కూడా మసీదుకు వెళ్లరాదని అని చెప్పలేదని పిటిషన్లో చెప్పారు.
- స్త్రీ పురుషులను ఖురాన్ వేరువేరుగా చూడలేదన్నారు.
ఈ అంశంపై విచారణ చేసేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది ఎటువంటి ఆంక్షలు లేకుండా… ఆ అంశంపై పిటిషన్ను పరిశీలించినట్లు అత్యున్నత న్యాయస్థానం వెల్లడించింది.
అలాగే, కేంద్ర ప్రభుత్వానికి । సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్ । ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు కూడా సుప్రీం కోర్టు నోటీసులు ఇచ్చింది.
Read Also: https://www.legandarywood.com