The eyes of the nations of the world towards the recession !

ప్రపంచ దేశాల చూపు ఆర్ధిక మాంద్యం వైపు:
ప్రపంచ బ్యాంకు తాజా హెచ్చరికలతో ప్రపంచ దేశాల వెన్నులో వొణుకు మొదలైంది, ‘అభివృద్ధి చెందుతున్న 69 దేశాలు దాదాపు 11 వందల కోట్ల డాలర్లు అప్పు బకాయిపడినట్టు ప్రపంచ బ్యాంకు తెలిపింది. మూడు దశాబ్దాల తరువాత మళ్లీ అదే చరిత్ర పునరావృతం అవుతోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక మాంద్యం మొదటి అడుగు శ్రీలంకతో ఆరంభమై…. ‘విదేశీ నిధుల కొరత | ఆహార | ఇంధన కొరతతో’ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా నాశనం చేసింది. ఇప్పుడు మరో 69 దేశాలు లంక బాటలోనే పయనిస్తున్నట్టు ఆర్థిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

రష్యా | ఉక్రెయిన్ యుద్ధంతో ప్రపంచ మార్కెట్లు స్తంభించిపోయాయి. భారీగా ‘చమురు | ఆహార’ కొరత నెలకొంది. అలాగే 107 దేశాల్లో, కోట్ల జనాభా అంటే ప్రపంచ జనాభాలో ఐదో వంతు ప్రజలకు పరిస్థితులు విషమిస్తున్నట్టు ఐక్యరాజ్యసమితి ఆందోళన వ్యక్తం చేసింది. ఆయా దేశాల్లో ఆహార కొరత | ఇంధన ధరల పెరుగుదల | ఆర్థిక కష్టాలు మొదలవుతాయని వెల్లడించింది.

తాజాగా ఆర్థికంగా కుప్పకూలనున్న దేశాల్లో ఈజిప్టు ముందువరుసలో ఉంది. ప్రపంచంలోనే అత్యధికంగా గోధుమలను దిగుమతి చేసుకుంటున్న దేశం ఈజిప్టు….ఈ దేశానికి గోధుమలను ఎగుమతి చేసేది ఉక్రెయిన్ | రష్యా దేశాలే. ప్రస్తుతం ఈజిప్టులో ఉన్న గోధుమల నిల్వలు మూడు నెలలకు మాత్రమే సరిపోతాయని…నిల్వలు అయిపోతే ప్రజలు ఆహార కొరతతోపాటు నిరుద్యోగం | మందగించిన ఆర్థిక వ్యవస్థతో కుదేలవుతోంది. ఈజిప్టు తరువాత టునీషియాను కష్టాలు వెంటాడనున్నాయి. ఈ దేశంలోనూ ద్రవ్యోల్బణం 7శాతం పెరిగింది. 82 కోట్ల డాలర్ల విదేశీ మారక ద్రవ్య లోటు నెలకొన్నది. ఇంధన ధరలు రికార్డు స్థాయిలో పెరిగాయి.

టునీషియా మార్గంలో లెబనాన్ పయనిస్తోంది. బేరూడ్‌లో 2020లో జరిగి పేలుడుతో లెబాన్ ధాన్యపు నిల్వలు పూర్తిగా నాశనమయ్యాయి. దీంతో నిత్యావసర ధరలు 11 రెట్లు పెరిగాయి. లెబనాన్ పౌండ్ విలువ 90 శాతం పడిపోయింది. పూర్తిగా ఉక్రెయిన్ గోధుమలపై ఆధారపడిన ఈ దేశం పరిస్థితి ఆందోళనకరంగా మారింది. ఆహార భద్రత కోసం ఇప్పటివకే 15 కోట్ల డాలర్లను ప్రపంచ బ్యాంకు నుంచి లెబానాన్ రుణంగా తీసుకుంది. అర్జెంటీనా కూడా అప్పుల్లో కూరుకుపోయింది. ఇప్పటివకే తొమ్మిది సార్లు అప్పులను కట్టలేక చేతులెత్తేసింది. పూర్తి అప్పుల్లో కూరుకుపోయిన అర్జెంటీనాలాగే… ఎల్ సాల్వడోర్ | పెరు దేశాలు కూడా విలవిలలాడుతున్నాయి. ఈ దేశాల్లోనూ పెరిగిన ద్రవ్యోల్బణం, ఆహార కొరత, నిరుద్యోగం, మండుతున్న ధరలతో శ్రీలంక పరిస్థితులు తలెత్తే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

ఆఫ్రికా దేశాలైన ఘనా | ఇథోఫియా | కెన్యా | దక్షిణాఫ్రికా దేశాల్లోనూ పరిస్థితులు విషమిస్తున్నాయి. టర్కీ కూడా ఆర్థిక సంక్షోభం దిశగా పయనిస్తోంది. ద్రవోల్బణం 70శాతం పెరిగింది. 50 వేల టన్నుల గోధుమలను ఇటీవల భారత్ నుంచి దిగుమతి చేసుకుంది. వచ్చే సంవత్సర కాలంలో డజనుకు పైగా దేశాల్లో ఆర్థిక సంక్షోభం తలెత్తనున్నట్టు ప్రపంచ బ్యాంకు నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఇది ఈ తరంలోనే అతి పెద్ద సంక్షోభంగా నిపుణులు విశ్లేషిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా సగానికి పైగా దేశాలు అప్పుల్లో కూరుకుపోతున్నాయి. మన పొరుగున ఉన్న శ్రీలంక తరువాత పాకిస్థాన్ | మయన్మార్ | నేపాల్‌ను కష్టాలు వెంటాడుతున్నాయి.

ఆయా దేశాల ఆర్థిక మాంద్యం ఎఫెక్ట్ భారత్‌పైనా పడనున్నది. ఇప్పటికే బెంగాల్‌ | ఆంధ్రప్రదేశ్‌ | పంజాబ్‌ | బీహార్‌ రాష్ట్రాలు లోటు బడ్జెట్‌తో కష్టాల్లో కూరుకుపోయాయి. సరైన చర్యలు తీసుకోకపోతే…. ప్రజలకు తీవ్ర కష్టాలు తప్పవని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరోవైపు ఉక్రెయిన్-రష్యా యుద్దం ఇప్పట్లో ఆగేలా లేదనే సంకేతలు కలరవపెడుతున్నాయి. యుద్ధం ఇలాగే కొనసాగితే మాత్రం పలు దేశాలు ప్రమాదంలో పడుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కారణం ఏదైనా రాబోయి…5 సంవత్సరాల కాలంలో….ప్రపంచ దేశాల ఆర్ధిక వ్యవస్థలు కుప్ప కూలటం | గడ్డు రోజులు మళ్ళీ పునరావృతం కానున్నాయని గణాంకాలు చెబుతున్నాయి. ఈ దుర్భర పరిస్థితుల నుంచి గట్టెక్కాలంటే….పరమేశ్వరాధన తప్ప వేరే మార్గం లేదని పురాణ ప్రవచన కర్తల ముందు చూపు అభినందనీయం.

About the Author

Leave a Reply

*